గ్రామపంచాయితీల సమాచారం కోసం దరఖాస్తు చేసిన రామ శ్రీనివాస్

టి.సుండుపల్లి మండలంలోని గ్రామపంచాయితీల సమాచారం కోసం అన్నమయ్య జిల్లా పంచాయితీ అధికారిని శ్రీమతి ఎం ధనలక్ష్మి కి దరఖాస్తును జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అందజేసారు. దరఖాస్తులో సుండుపల్లి మండలంలో గ్రామపంచాయితీలు ఎన్ని, అవి ఏవేవి వాటి ప్రధాన కేంద్రాలు పేర్లు మరియు వాటి జనాభా, కొత్తగా ఎన్నికలు జరిగిన గ్రామపంచాయితీలు ఎన్ని అవి ఏవేవి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఎన్నికలు జరిగిన పంచాయితీలు ఏవేవి, ఎన్ని, హైకోర్టుకు సమర్పించిన సమాచారం కాపీలు ఇవ్వవలసినదిగా కోరుతున్నామని తెలియజేసారు. ఏ కారణం చేత హైకోర్టు ఉత్తర్వుల ద్వారా ఎన్నికలు జరగకుండా నిలిపివేయబడినవి అందుకు గల కారణాలు.. ఇవ్వాలని డి.పి.ఓని రామ శ్రీనివాస్ కోరారు.