డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా 2వ రోజు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముచ్చిమిల్లి రోడ్డు శ్రీ బిల్డింగ్స్ నుండి ప్రారంభించి విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు నివాదంతో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. వైసీపీ రాష్ట్ర ఎంపీలను ట్యాగ్ చేసి వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా నియోజకవర్గ జనసేన నాయకులను, జనసైనికులను కోరుతున్నామని పోలిశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపైన్ లో జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు బుంగారాజు, సంపతి సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి క్రిష్ణ, వెల్ల 1 గ్రామం జనసేన పార్టీ MPTC చిక్కాల స్వామి, ఏరుపల్లి ఉట్రుమిల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC సాక్షి శివక్రిష్ణ కుమార్, రాంబాబు నాయుడు, సందీప్, కొలగాని సతీష్, కుంపట్ల పవన్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.