శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా నివాళులర్పించిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రం నడిబొడ్డున సర్కిల్ నందు శ్రీకృష్ణదేవరాయలు వారి 493 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ స్పూర్తి ప్రదాత అలానే విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిన గొప్ప వ్యక్తి ఆయన సమాజానికి చేసిన సేవలను మరింతగా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రామయ్య, సామాజిక వర్గ నేతలు వెంకట్టయ్య, రామంజులు, రమణ, హరిక్రిష్ణ, సుబ్బరాజు, రవి, బాలాజీ, చరణ్, గ్రామపెద్దలు, స్థానికులు, మండల ప్రజలు పాల్గొన్నారు.