మొలకలు పౌర్ణమి ఉత్సవాలలో పాల్గొన్న రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో స్వగ్రామమైన పెద్దబలిజపల్లిలో మొలకలు పౌర్ణమి సందర్భంగా గ్రామస్థులు అందరూ కలిసి బోనాలు పట్టిన కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొని శ్రీశ్రీశ్రీకోతపురమ్మ, శ్రీశ్రీశ్రీమొలకాలమ్మ, శ్రీశ్రీశ్రీఇరగలమ్మ వారికి సాంస్కృతి సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా భక్తులు, స్థానికులు, గ్రామప్రజలు, ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. అలానే జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, స్థానిక గ్రామస్థులు, జనసైనికులు, యువకులు, వివిధ ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.