ఎమ్మెల్యే నవాజ్ బాషపై రాందాస్ చౌదరి ఫైర్

  • నాలుగేళ్ల నీ పనితీరు ఇదేనా…?
  • చేసిన అభివృద్ధి చెప్పుకోలేని ఎమ్మెల్యే

మదనపల్లె జిల్లా వదిలేశావు, రైల్వే లైన్ అడిగే దైర్యం లేదు, హంద్రీనీవా నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నింపలేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేని ఎమ్మెల్యే నవాజ్ బాష అంటూ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి తీవ్ర స్దాయిలో ద్వజమెత్తారు.‌ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా నాలుగేళ్ల పనితీరుపై రామదాస్ చౌదరి తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. చేసిన అభివృద్ధిని కనీసం చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసిపి పార్టీ నాయకులు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో గంగారపు రామదాస్ చౌదరితో పాటు జనసేన పార్టీ నాయకులు జంగాల శివరామ్ రాయల్, చేనేత రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం జగదీష్, గ్రానైట్ బాబు, శంకర్, గోపాలకృష్ణ, కుమార్, రాధిక, లత, కిరణ్ కుమార్ రెడ్డి, నాగరాజు, భరత్, ప్రసాద్, బంగారం, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ విలేఖరుల సమావేశంలో మాట్లాడటం తప్ప చేసిన అభివృద్ధి ఏమిటని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధిపై మాట్లాడలేని ఎమ్మెల్యే అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.