ప్రమాదంలో గాయపడిన జనసైనికునికి రాందాస్ చౌదరి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం
మదనపల్లె, జనసేన పార్టీ తరుపున చిత్తూర్ లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొని మదనపల్లెకి తిరిగి వస్తున్న జనసైనికులకు కొన్ని రోజుల కిందట ఆక్సిడెంట్ జరిగిన విషయం అందరికి తెలిసినదే. ఆ ప్రమాదంలో గాయపడిన జనార్దన్ కి జనసేన రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి 10 వేలరూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఆయన యోగ క్షేమలు తెలుసుకొని.. త్వరగా కొలుకోవాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం మరియు మదనపల్లె రూరల్ జనసేన మండల అధ్యక్షులు రోనూరు బాబు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-4.10.09-PM-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-4.10.09-PM-1-1024x477.jpeg)