ఎచ్చెర్లలో హలో ఎచ్చెర్ల.. బై బై కిరణ్

  • వారాహి పంతం- వైసీపీ అంతం రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో జనసేన ర్యాలీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రస్థాయిలో హలో ఏపీ.. బై బై వైసీపీకి పిలుపునిచ్చిన నేపధ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుధవారం లోకల్ ఎమ్మెల్యే కు హాల్లో ఎచ్చెర్ల-బై బై కిరణ్ అని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ పిలుపునిస్తూ వారాహి పంతం- వైసీపీ అంతం అని రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, లావేరు మండల అధ్యక్షులు బార్నాల దుర్గారావు, రణస్థలం మండల నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, కరిమజ్జి మల్లేశ్వర రావు, చిరంజీవి, సువ్వాడ రామారావు, అలాగే ఎంపీటీసీ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.