నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలసిన రాయపూడి

అవనిగడ్డ నియోజకవర్గం: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నందు గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ను జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ రాయపూడి వేణుగోపాల్ రావు ఆరోగ్యం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం సమస్యలు గురించి వివరించటం జరిగింది. పొత్తులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలనీ మనోహర్ ను కోరటం జరిగింది. సదరు విషయం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాము అనీ అయన హామీ ఇవ్వటం జరిగింది. చాలా కాలం తరువాత పార్టీ ఆఫీస్ వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉన్నది.