జనసైనికుడు రాంబాబుకు రాయపురెడ్డి ఆర్థిక సహాయం
మాడుగుల: గాజువాక కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, చింతలూరుకు చెందిన జనసైనికుడు కాలంగి రాంబాబుకు ఇటీవల బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ రాంబాబును పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ తరఫున 5,000/- రూపాయలు తన సొంత నగదును వారి కుమారుడు కాలంగి గణేష్ కు ఆర్దిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలూరు జనసైనికులు కాంతారావు, మూర్తి, సత్తిబాబు, ఈశ్వరరావు, హరిబాబు, రాజు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-21-at-8.32.56-PM.jpeg)