నటుడు పోసానిపై రాజోలు, సఖినేటిపల్లి మరియు నగరం పోలీసులకు పిర్యాదు చేసిన రాజోలు జనసైనికులు

జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసైనికులను అనుచితమైన అసభ్యకరమైన పదజాలంతో వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన సినిమా ఆర్టిస్టు పోసాని కృష్ణమురళి మీద రాజోలు నియోజక వర్గంలో రాజోలు, సఖినేటిపల్లి మరియు నగరం పోలీస్ స్టేషన్ లలో బోనం సాయి, రేఖపల్లి సురేష్ మరియు గుళ్ళింక గంగాధర్ ఆద్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు గద అంజిబాబు, కుంచె పండు, నిమ్మకాయల నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.