ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు జన్మదిన వారోత్సవాలు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరులో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు 53వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక ఏలూరు కత్తెపువీధి సెంటర్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి మా ప్రియతమ నేత రెడ్డి అప్పలనాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఏలూరు ప్రజా సమస్యలు తీర్చేటువంటి శక్తిని, రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో ఏలూరు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు వీరంకిపండు, కూనిశెట్టి మురళి, పైడి లక్ష్మణరావు, బోండా రామానాయుడు, గొడవర్తి నవీన్, పవన్, నరసింహారావు, స్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.