ఓటు నమోదు చేసుకోండి

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటు అనే ఆయుధంతో నవ సమాజాన్ని నిర్మిద్దాం. భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా లభిస్తోంది. ఉదాసీనతను వదిలి ఓటనే ఆయుధాన్ని వినియోగించుకుందాం. ఓటు వేయడం ద్వారా అసలైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మిద్దాం. మనమంతా ఓటేసి నవ సమాజానికి పూలబాటలు పరుద్దాం అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.