చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా 14వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు

రాజంపేట: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా మంగళవారం రాజంపేట పట్టణంలోని డి. ఆర్.యల్ లాడ్జ్ రెస్టారెంట్ ఎదురుగా “రిలే నిరాహార దీక్షలు” నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజంపేట జనసేన నియోజకవర్గ ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ఆదేశాల మేరకు జనసేన నియోజక వర్గ నేత యం. వెంకటేశ్వరరావు,పొలిశెట్టి శ్రీనివాసులు,జద్దా శిరీష,భాస్కర పంతులు, చౌడ య్య, తోట వెంకట సుబ్బయ్య, వీరయ్య ఆచారి, రాఘవ తదితర జనసేన కార్యకర్తలతో కలిసి సంఘీభావం ప్రకటించారు. రాజంపేటని ఎవరికీ కేటాయించినా పెద్ద మెజారిటీతో గెలిపించుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో రైతు “రాగి నారాయణ” చంద్రబాబు నాయుడు గురించి ఆయనకు సంఘీభావంగా గీతాన్ని ఆలపించి తన అభిమానాన్ని చాటు కున్నారు. ఈ నిరసన కార్యక్రమాలల్లో
పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.