వేమూరు సెంటర్లో బాబు జగ్జీవన్ విగ్రహం దగ్గర రిలే దీక్ష

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 11 వ రోజు దీక్షలో భాగంగా చిలకా రమేష్ దండలు వేసి దీక్ష ప్రారంభం చేశారు. వేమూరు నియోజకవర్గం ఎమ్మార్పిఎస్ ఇంఛార్జి వై. దాసు మాదిగ మాట్లాడుతూ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట భద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. బాపట్ల పార్లమెంట్ ఎంపీ నందిగం సురేష్ పార్లమెంట్ సమావేశాలలో ఎ.బి.సి.డి వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని అడగాలని అన్నారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్న మాదిగలు జాతికోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల ఎమ్మార్పిఎస్ కన్వీనర్ మరియు జనసేన నాయకులు ఆలపాటి రాకేష్ మాదిగ, చుండూరు మండలం ఎమ్మార్పిఎస్ నాయకులు మున్నంగి ఐజాక్ మాదిగ, భట్టిప్రోలు మండలం ఎమ్మార్పిఎస్ కన్వీనర్ ఆత్తోట ఇస్సాకు మాదిగ, జంపని గ్రామం ఎమ్మార్పిఎస్ నాయకులు కత్తి సునీల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.