ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. మే 5వ తేదీ నుంచి మే 23 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్ పరీక్షలు.. అలాగే మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల పనిదినాలను కుదించడం వల్ల ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్కు సంబంధించిన సిలబస్లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్సైట్ bie.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొంది.