జనసేనలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లి నియోజకవర్గం: ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ రామాంజనేయులు మరియు వారి కుమారులు శ్రీరామ హరిహరన్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. గురువారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున, జనసైనికుల తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. వీరి నాయకత్వంలో మదనపల్లెలో మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరి తెలిపారు.