మహా పాదయాత్రకి మద్దతు తెలిపిన రేపల్లె జనసేన
రేపల్లె, అమరావతి రైతుల మహా పాదయాత్రకి జనసేన పార్టీ పూర్తి స్థాయి మద్దతులో భాగంగా నగరం మండలం, రేపల్లె నియోజకవర్గానికి వచ్చిన అమరావతి రైతులకు జనసేన పార్టీ తరుపునజిల్లా కార్యదర్శి మత్తి భాస్కరరావు, నగరం మండల నాయకులు గోపరాజు ఉదయ్ కృష్ణ సారథ్యంలో అందుబాటులో ఉన్న జనసైనికులు రైతులకు ఘనంగా స్వాగతం పలికి వారి మహాపాదయాత్రకి మద్దతు తెలిపి వారితో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర ఏలేటిపాలెం రాగానే ఆ గ్రామ జనసైనికులు, మహిళలు, చిన్న జనసైనికులు సాదర స్వాగతం తెలిపారు. మహిళలు రథంకి హారతులు ఇచ్చారు. మద్యాహ్నం భోజనం విరామం తర్వాత సజ్జవారిపాలెంలో మొదలయ్యిన యాత్రలో కూడా జనసైనికులు పాల్గొని రేపల్లె వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చందోలు ప్రసాద్ తో పాటు నగరం, చెరుకుపల్లె, రేపల్లె, నిజాంపట్నం జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-20.01.16-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-20.01.17-1024x461.jpeg)