ఉప్పల్ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఉప్పల్ నియోజకవర్గం: ఉప్పల్ జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కొల్లు నరేష్ నాయుడు మరియు కొమ్మినేడి శేషు ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. వేడుకల్లో కొల్లు నరేష్ నాయుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలనే దృడ సంకల్పంతో మహనీయుల ఆశయ సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలసి నడుస్తూ.. జనసేన పార్టీ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ‌ఈ కార్యక్రమంలో డి. ఎల్ ప్రసాద్, ఉంగరాల నాయుడు, వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి, కృష్ణవేణి, ఎల్. కె. నాయుడు, రఘురామయ్య, నారాయణరావు, అప్పారావు, ఎన్ రాంబాబు, సాంబశివరావు మస్తాన్, సుబ్రహ్మణ్యం మరియు జనసైనికులు, వీరమహిళలు, బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.