చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-8.06.59-PM.jpeg)
చిత్తూరు, 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జనసేన పిఏసి సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పిఏసి ఆఫీసు నందు జిల్లా కార్యవర్గ సమక్షంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ భారతదేశ ఔనిత్యాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎల్లవేళలా కాపుడుకుంటూ భావితరాలకు వారసత్వంగా అందించాలని మరియు దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, కార్యవర్గానికి మరియు జనసేన శ్రేణులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.