రాజంపేట జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన జనసైనికులు

రాజంపేట, జనసేన ఆధ్వర్యంలో రాజంపేట మండలం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటమ్మ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ముఖ్య నాయకురాలు పోలిశెట్టి రజిత జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నారు. దేశమంతా కులమతాలకు అతీతంగా జరుపుకునే పెద్దపండుగ గణతంత్ర దినోత్సవం అని భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ, దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యతప్రతి భారతీయుడు పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, బండ్ల రాజేష్, పొలిశెట్టి శ్రీనివాసులు కిషోర్, సుబ్బరాయుడు, తాళ్ళపాక శంకరయ్య పాల్గొన్నారు.