Adilabad: అంధులకు, చెవిటి, మూగ వికలాంగులకు బస్ పాస్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం

ఉమ్మడి అదిలాబాద్, ముధోల్ నియోజకవర్గం అంధులకు, చెవిటి, మూగ వికలాంగులకు బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ డిపోమేనేజర్(బస్ పాస్ కౌంటర్) లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో పల్లె పల్లెకి వెళ్లి వాళ్ళ అవసరం కోసం, టార్గెట్ కంప్లీట్ చేయడం కోసం వికలాంగులఅన్దరికి బస్ పాస్ లు ఇచ్చారు. కాని ఇప్పుడు అంధులకు, చెవిటి, మూగ వాళ్ళకి 100 శాతం వుంటేనే బస్ పాస్ లు ఇస్తాం లేదంటే ఇవ్వం అంటున్నారు. కాని ఇదే వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు బస్ పాస్ లు ఇవ్వడానికి ఎందుకు ఆంక్షలు విధించారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి 40 శాతం కంటే ఎక్కువ వున్న వాళ్ళందరికీ బస్ పాస్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని లేని యెడల దశల వారీగా పోరాటం చేయడానికి సిద్దంగా వున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోజ రెడ్డి, నాగ్ నాథ్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.