సమాజానికి మీరే గౌరవం- కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం శనివారం వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో 39వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ వై.వి.వి. ప్రసాదరావును , ఎం. వెంకట్రావు ను కలిసి మాట్లాడారు. నేటి సమాజంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు నేడు ప్రస్తుత సమాజంలో జరుగుచున్న పరిణామాలని వారి విశ్లేషణలో విన్నారు. వారితో మాట్లాడుతూ విద్యార్ధులు నవసమాజ నిర్మాతలు అనీ, కానీ వారికి ఆ అవగాహన కేవలం వారి ఇంటిలోని మరియు చుట్టుపక్కల ఉన్న సీనియర్ సిటిజన్స్ ద్వారా అన్నది మరువకూడదన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలలో మీయొక్క అనుభవాన్ని ఉపయోగించి సలహాలను, సూచనలను తమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేసి పార్టీని ఆశీర్వదించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవర్లను అందచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ చీకట్లో శ్రీనివాస్, మిర్యాల హైమావతి, మావులూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.