జనసేన పోరాటానికి స్పందన..

  • మరమ్మత్తులు చేపడుతున్న ఆర్.అండ్ బి అధికారులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండ ట్రంకు రోడ్డు మోకాల్లోతు గుంటలు ఏర్పడి, నిత్యం రద్దీగా తిరిగే ట్రంకు రోడ్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంపై జనసేన పార్టీ నాడు పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ పోరాటానికి, స్పందించి సింగరాయకొండ ట్రంకు రోడ్డును మరమ్మతులు చేపడుతున్న ఆర్ అండ్ బి అధికారులకు జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక జనసేన పార్టీ పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమంను, చిత్రీకరించి, ప్రచురించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు పేరుపేరునా జనసేన పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేసారు. సింగరాయకొండ మండలంలో ప్రజల సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేసి పరిష్కార మార్గమునకు ఎల్లవేళలు జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేసారు.