భీమ్లా నాయక్ చిత్రం పై ఆంక్షలు వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

*వాసగిరి మణికంఠ అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి

అనంతపురం, ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు పెట్టడం వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు రాజకీయాలకు అద్దం పడుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమ పై ఎందరో కళాకారులు,అనేకమంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి కోసం వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకోవడం అవగాహనారాహిత్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆదరిస్తుంటే, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించటం దుర్మార్గం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో పవన్ అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి కి తగిన గుణపాఠం చెబుతారు. ప్రభుత్వం ఇకపైన పవన్ కళ్యాణ్ సినిమాల పై శ్రద్ధ తగ్గించి పాలనపై దృష్టి పెట్టాలని వాసగిరి మణికంఠ వ్యాఖ్యానించారు.