వంద పడకల వైద్యశాల నిర్మాణ నమూనాపై సమీక్ష

మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఎంసీడీసీ కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలోని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ వింగ్ & రీసెర్చ్ సెంటర్ ఆవరణలో నిర్మించనున్న వంద పడకల వైద్యశాల నిర్మాణ నమూనాపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏపీఎంసీడీసీ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన నేపథ్యంలో, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం నిర్మించనున్న ఈ వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించిన చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపీఎంసీడీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. చిట్టిబాబు గారితో పాటు ఇతర అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు, మంత్రివర్యులు నారా లోకేష్ గారి మార్గదర్శకంలో మంగళగిరిలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక మౌలిక వసతులు మరియు అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Share this content:

Post Comment