రణస్థలంలో కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు సంఘీభావం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో గల శ్యామ్ క్రెగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియచేయడానికి వచ్చిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, భూపతి అర్జున, రామకృష్ణ, శ్రీనివాస్, రాజు, సునీల్, చిన్న మరియు జనసేన కార్యకర్తలు సంఘీభావం తెలియ చేసిన తర్వాత పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ… యాజమాన్యం వారు ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నానని సమస్య పరిష్కారం కాని యెడల జనసేన అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తాను అని చెప్పి కార్మికులు అందరికీ తెలియజేశారు.