జనసేన ప్రతిష్టను దిగజార్చే ఆకతాయిల అల్లర్లను అరికట్టాలి: జనసేన వినతి
రాజమండ్రి: ఇటీవల జనసేన ఫేస్ బుక్ పేరుతో జై జనసేన జై పవన్ అనే ఫేక్ ఐడీలతో మహిళలను కించపరుస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొందరు ఆకతాయిలు చేస్తున్న పనిని అరికట్టాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జిల్లా ఎస్పీకి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో సిటీ జనసేన ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, జనసేన ప్రధాన కార్యదర్శి పైడిరాజు, సిటీ జనసేన కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-10.35.36-AM-1024x462.jpeg)