గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా తయారైంది: పాశం నాగబాబు

నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మీద జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు స్థానిక నాయలుకులతో కలిసి సందర్శించి నిరసన తెలిపి అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాలలో దాదాపు అన్ని ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిధులను వాడుకుంటూ గ్రామ అభివృద్ది, సమస్యలను గాలికి వదిలేసింది అని సర్పంచులు కూడా చేసేది ఏమి లేక చేతులెత్తేశారు. పంచాయితీరాజ్ శాఖ అధికారులు కూడా నిధులు లేవని మేము చేసేది ఏమి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పంచాయితీలకు నిధులు మంజూరు చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుతో పాటు మండల గ్రామ నాయకులు ఉప్పే నరేంద్ర, వల్లూరి సింహాచలం, చిరంజీవి, తల్లిబోయిన సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.