మంత్రి స్థానంలో ఉన్న రోజా దిగజారి మాట్లాడడం హేయమైన చర్య
మంత్రి రోజా గారు నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు.
మంత్రి స్థానంలో ఉన్న మీరు దిగజారి మాట్లాడడం హేయమైన చర్య.
జనసేన నాయకులు పట్ల అనవసర వ్యాఖ్యలు చేస్తే ప్రతిఘటిస్తాం.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు.
కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో మీరు వ్యవహరించిన తీరు ఇంకా ప్రజలకు గుర్తుఉంది. కాంగ్రెస్ పిల్ల పార్టీ అయిన వైసీపీలో చేరిన తర్వాత టిడిపి నేతలను ఇప్పుడు ఎలా తిడుతున్నారో మా అందరికీ తెలుసు.
అధికార మదంతో ఉన్న మీ కంటికి అందరూ పిచ్చి పట్టిన పిల్ల వెధవల్లాగా కనబడడంలో తప్పులేదు.. వైసిపి అధికారాన్ని త్వరలోనే అంధకారం చేసే బాధ్యత జనసేన కార్యకర్తలు తీసుకున్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
స్త్రీలు అంటే జనసేన నాయకులకు కార్యకర్తలకు ఎంతో గౌరవం.. కనీసం ఇప్పటినుంచైనా మంత్రి రోజా గారు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. జనసేన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అధికార మదంతో నోటికి వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా మాట్లాడితే మా జనసేన వీర మహిళలు మీ భరతం పడతారని జనసేన పార్టీ, గుంటూరు నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-08-at-8.15.22-PM.jpeg)