కొల్లాపురమ్మ జాతరకు విరాళమిచ్చిన రొద్దం మండల జనసేన

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం దొడగట్ట పంచాయితీ డి.రంగాపురం మరియు వైటి రెడ్డిపల్లి గ్రామాలలో కొల్లాపురమ్మ జాతర సందర్బంగా రొద్దం మండల ఉపాధ్యక్షుడు సోమశేఖర్ మరియు జనసైనికుల ఆహ్వానం మేరకు వారి ఇళ్లల్లో విందుకు హాజరైన రొద్దం మండల అధ్యక్షులు యు. గంగాధర్, పెనుకొండ మండల అధ్యక్షులు, మహేష్, రొద్దంమండల నాయకులు, గంగాధర్, చలపతి, తిరుపతి, వెంకటేష్, గిరి, రవి మరియు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే మండల అధ్యక్షులు యు.గంగాధర్ సహకారంతో ఆ గ్రామంలో దేవస్థానంకు గ్రామ పెద్దలు ఆర్.టి నాగేష్ కి ఆలయ అభివృద్ధి కొరకు జనసేన పార్టీ తరఫున 5001/- రూపాయలు ఇవ్వడం జరిగింది.