చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్స్ విజయం

కరోనా కారణంగా ఐపీఎల్ సీజన్ లేటుగా మొదలైనప్పటికి లేటెస్టుగా మొదలైనట్టు అనిపిస్తోంది. లీగ్‌లోని ప్రతీ మ్యాచ్ బోలెడంత థ్రిల్ ఇస్తుంది. ఐపీఎల్ 2020లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య రసవత్తరoగా జరిగిన పోరులో చివరికి రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (32 బంతుల్లో 74; 1 ఫోర్, 9 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లకు 6 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్ (37 బంతుల్లో 72; 1 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వాట్సన్(33) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో ధోని(29) మెరుపులు మెరిపించినా.. టార్గెట్ చేరుకోలేకపోయారు. రాయల్స్ బౌలర్ రాహుల్ ట్వేటియా 3 వికెట్లు తీశాడు. కాగా, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ దక్కించుకున్నాడు.