28 నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ బస్సులు
కరోనా వైరస్ నేపథ్యంలో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర, సిటీబస్సు సర్వీసులను పునఃప్రారంభించిన టీఎస్ఆర్టీసీ తాజాగా మహారాష్ట్ర, కర్ణాటకకు సైతం బస్సులను నడపనుంది.
సెప్టెంబర్ 28వ తేదీ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఆ రెండు రాష్ర్టాల నుంచి తెలంగాణకు కూడా బస్సులు రానున్నాయి. బెంగళూరుకు మాత్రం బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. రాయచూర్, బీదర్, గుల్బర్గా, నాందేడ్, ముంబయి, పుణె, నాగ్పూర్, చంద్రాపూర్ ముఖ్యమైన మార్గాల్లో టీఎస్ఆర్టీసీ బస్సులు నడపనుంది. నడపనుంది. బెంగళూరుకు మాత్రం బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు.
మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్డౌన్తో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో కొవిడ్ – 19 నిబంధనలను పాటిస్తూ 25 శాతం బస్సులను శుక్రవారం ప్రారంభించారు. కండక్టర్, డ్రైవర్లకు వ్యక్తిగతగా ఒక్కొక్కటి చొప్పున శానిటైజర్ బాటిల్స్ ఇచ్చారు. కండక్టర్ ప్రయాణికుల చేతులపై శానిటైజర్ స్ర్పే కొడుతున్నారు. మాస్కు ఉంటేనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు.