Mellachervu: ప్రత్యేకాలంకరణలో స్వయంభువుడు

స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్‌శర్మ, ధనుంజయ శర్మ శాస్ర్తోక్తంగా జరిపించారు.

ఈ సందర్భంగా స్వామి వారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహానివేదన, మంగళ నీరాజనం మంత్ర పుష్ప పూజలను వేదమంత్రాలతో జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.