రైతు దినోత్సవం.. ఇచ్చాపురం జనసేన ఆద్వర్యంలో రైతులకు ఘన సన్మానం

ఇచ్చాపురం: జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు సమక్షంలో రాష్ట్ర మత్సకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి, బెహారా, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కవిటి మండలంలోని కుసుంపురం గ్రామంలోని రైతుల కష్టాలు తెలుసుకుని రైతులు తామాడ గవరయ్య, బత్తిని లక్ష్మణ్ లు డిగ్రీ చదువుకుంటూ తమ తల్లిదండ్రులకు సహాయపడాలనే పొలంలో రైతులతో కష్టపడుతున్న దుమ్ము శిరీష కు రైతులు బత్తిని లోకేశ్వరరావు, కృష్ణారావు, కేశవరావు, ఈశ్వరరావు, రుక్మిణి పలువురుని రైతుల సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రొక్కళ్ళ భాస్కర రావుయ్, జుత్తు చలపతి, ఇద్ధి సురేష్, రామకృష్ణ, గుమ్మడి శ్యామ్, బడే రాజు, దేవా, మోహన్, నవీన్, రవి, చిట్టో బెహారా, రంజిత్, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.