జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ను మర్యాదపూర్వకంగా కలసిన సారే ఓబులేషు నాయుడు
గిద్దలూరు నియోజకవర్గం, కొమరోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సారే ఓబులేషు నాయుడు గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన “నేతాజీ” పుస్తక సమీక్షా కార్యక్రమంలో పాల్గొని, అనంతరం జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని.. కొమరోలు మండలంలో ప్రజలకు అండగా ఉంటూ.. జనసేన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-25-at-10.31.00-AM-1024x472.jpeg)