జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సాయి శరత్
76 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “స్వరాజ్య స్థాపన – అలనాటి సమరయోధుల ఘనత
సురాజ్య స్థాపన – ఈనాటి స్వతంత్ర పౌరుల బాధ్యత” అని గుర్తుం చేసుకుంటూ..త్రికరణ శుద్దిగా దేశ పురోగతి, శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ఆకాంక్షిస్తూ, ప్రతీ ఒక్కరి ఆత్మగౌరం రక్షించబడేలా వ్యవస్థల నడవడిక ఉండాలని అప్పుడే మహనీయుల త్యాగలకి ఫలితం ఉంటుందని అన్నారు.