జీతం పెంచలేదు..పర్మినెంట్ చేయలేదు

  • ఇది జగన్ రెడ్డి పాలన: గాదె

గుంటూరు, అధికార దాహంతో పాదయాత్ర చేసి అమలు కాని హామిలిచ్చిన ముఖ్యమంత్రి ఇప్పడు మొహం చాటేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు గాదె విమర్శించారు. గుంటూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రెగ్యులరైజ్ చేయాలని సోమి ఉదయ్ ఆధ్వర్యంలో నిరహారదీక్ష చేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపారు. కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన గుర్తించకపోవటం దారుణమన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు ఉన్న శ్రద్ధ, నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులపై మాత్రం లేదన్నారు. నగర కార్మికులు ఒక్క రోజు చెత్త తీయకపోతే ఇబ్బందులు తెలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి స్పందించి పర్మినెంట్ చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా జనరల్ సెక్రటరీ నారదాసు ప్రసాద్, శిఖా బాలు, మధులాల్, తన్నీరు గంగరాజు, దాసరి వెంకటేశ్వరావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.