కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న సల్మాన్ ఖాన్

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ టీకా వేయించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి డోస్ టీకా తీసుకోగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. కొద్ది రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోకున్నారు. లాక్ డౌన్ సమయంలో సల్మాన్ పూర్తి తన ఫాం హౌజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌.. నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా గతేడాదే విడుదలై ఉండేది. ఈ సినిమాకు సంబంధించిన హక్కులను జీ స్టూడియోస్ దక్కించుకుంది. ఈ సినిమాను 2021 ఈద్ వీకెండ్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు. ఇక సల్మన్ ఖాన్‌కు ఈద్ సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది. ఈ పండగ సమయంలో రిలీజైన దాదాపు మెజారిటీ చిత్రాలు హిట్ అనిపించుకున్నాయి. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన ఈద్ పండనే నమ్మకున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు రణ్‌దీప్ హుడా, జాకీ ఫ్రాఫ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది.