“నా సేన కోసం నా వంతు” విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంపత్ నాయక్
హైదరాబాద్, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి అండగా నిలబడేందుకు, పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు విరాళాలు అందిద్దాం. మరింత బలంగా వ్యవస్థ మార్పు కోసం పోరాడుదామని పిలుపునిచ్చిన తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, హైదరాబాద్ కమిటీ సభ్యులు రాజేష్, ఓయూ కమిటీ సభ్యులు చిరంజీవులు, రాజేష్, అజయ్, హరీష్, సంపత్, నరేష్, నిజాం కళాశాల నాయకులు మోతిలాల్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-18.44.27-1-1024x759.jpeg)