ప్రచార వేగం పెంచిన సంపత్ నాయక్
తెలంగాణ, కొణిజర్ల మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గ్రామ యువత, మహిళలను కలిసి ఈసారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని బిజేపి బలపరచిన జనసేన అభ్యర్ధి డా.సంపత్ నాయక్ మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిజర్ల ప్రజలను కోరడం జరిగింది. మంగళవారం ప్రచారంలో భాగంగా దాదాపు 10 గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-14-at-19.39.53-1024x458.jpeg)