విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

జనసేన పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటను వేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకల్లో భాగంగా రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన పదిమంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరిజాగ్రత్తలలో వారు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), దాసరి యోగేష్, ఎర్నాగుల చక్రవర్తి, కిలారి ప్రసాద్, తాతపూడి రామకృష్ణ మాష్టారు, రాగోలు సాయి కిరణ్, చందక తనూజ్, కె.వినయ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.