ధర్మవరం జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ధర్మవరం పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దంపతుల సమక్షంలో జడ్జిలు హరిత, ప్రసన్న, లతా దేవి, దుర్గా, వీరనారాయణమ్మ పర్యవేక్షణలో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున సంక్రాంతి ప్రత్యేక ముగ్గుల పోటిలను నిర్వహించడం జరిగింది. ముగ్గులు వేయడానికి వందలాది మంది మహిళలు మరియు పార్టీ వీరమహిళలు విచ్చేసి పోటీపడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు అయ్యాక గంగిరెద్దులతో ఆటలు ఆడించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలు: ప్రధమ బహుమతి విజేత ప్రసన్నలక్ష్మి 5016, ప్రత్యేక బహుమతి విజేత పద్మావతి 5016, ద్వితీయ బహుమతి విజేతలు సౌజన్య 2016, సాయి సుష్మ 2016, శ్రీదేవి 2016, మణిమాల 2016, తృతీయ బహుమతి విజేతలు నాగజ్యోతి 1016, చంద్రకళ 1016, జయశ్రీ 1016, భాగ్యలక్ష్మి 1016, నారాయణమ్మ 1016, రేణుక 1016, ప్రియాంక 1016, ఉమామహేశ్వరి 1016, భవాని 1016, మానస 1016 మరియు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు క్యారీ బాక్స్, జాకెట్ పీస్ పసుపు కుంకుమ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగు మహిళలు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, బత్తలపల్లి మండల కన్వీనర్ పుర్రం శెట్టి రవి, ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, జనసేన పార్టీ నాయకులు కోటిరెడ్డి రాజారెడ్డి అడ్డగిరి శ్యామ్ కుమార్, గొట్లురు జీవి, కోటికి రామాంజి, ప్యాధింది వెంకటేష్, జయరామ్ రెడ్డి, కడపల సుధాకర్ రెడ్డి మరియు రాజేష్, ధారా గంగాధర్, చిలకం సుధాకర్ రెడ్డి, బాషా, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.