రాజోలు జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

  • వైసీపీ జి.ఓలు భోగి మంటల్లో ఆహుతి చేసిన జనసేన నాయకులు

రాజోలు నియోజవర్గం: జనసేన- తెదేపా ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో కార్యక్రమం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధ్యక్షులు ఆదేశాలు మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజవర్గం, మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామంలో నిర్వహించిన భోగి వేడుకల్లో జనసేన నాయకులు, తెదేపా నాయకులు పాల్గొని భోగిమంటలు వెలిగించి వైకాపా ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, జనసేన -టిడిపి సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, టీడీపీ ఎంపీపీ కేతా శ్రీనివాస్, మలికిపురం జనసేన పార్టీ అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, వైస్ సర్పంచ్ రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు రాము, యెనుముల సత్యనారాయణ మూర్తి, గ్రామ జనసేన నాయకులు, గ్రామ టిడిపి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.