తుని జనసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజాశేషు ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళేవిధంగా కార్యాచరణ చేస్తూ తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం, బొడ్డవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల ప్రెసిడెంట్ పెదపాత్రుని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నక్కా రామకృష్ణ, నాయకులు అద్దేపల్లి బాలాజి, పివివి నాగూర్, నాగేశ్వరరావు మరియు గ్రామ జనసైనికులు అభిషేక్, సురేష్, దుర్గాప్రసాద్ నాయుడు, సతీష్, రాజుబాబు, మండల జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.