సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఐటీ సమావేశం

సర్వేపల్లి పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ నాయకులు బోబ్బేపల్లి సురేశ్ నాయుడు, నెల్లూరు జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ నక్కల శివ కృష్ణా, సర్వేపల్లి ఐటీ టీమ్ అభిషేక్ మరియు మిగతా సభ్యులతో కలిసి జనసేన పార్టీ ఐటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాగంగా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఐటీ విభాగం తమవంతు కృషి చేస్తూ, సోషల్ మీడియా మరియు పార్టీ పరమైన యాప్స్ మీద నాయకులకు, క్రియాశీలక సభ్యులకు పూర్తి అవగాహనా శిక్షణ ఇచ్చి పార్టీ భావజాలాన్ని, ఆశయాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకు వెళ్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ జరిగింది. ఈ సమీక్షలో జిల్లా ఐటీ టీమ్ కోర్ మెంబెర్స్ మన్నేపల్లి చైతన్య, పసుపులేటి ప్రసాద్ మరియు ఐటీ విభాగం మెంబెర్స్, జనసేన నాయకులు పాల్గొన్నారు.