పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా మొక్కల పంపిణీ చేసిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా రెండవ రోజు ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి హరిజనవాడలో జనసేన పార్టీ నాయకులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ చేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ముత్తుకూరు మండలం అంటే ఒకవైపు పవర్ ప్లాంట్లు, మరో వైపు ఆయిల్ కంపెనీల ద్వారా వెలువడిన పొల్యూషన్ తో కాలుష్యం నిండిపోయాయి ఉంటుంది. నిండిపోయిన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యంతో ప్రజలు త్వరలో అల్లాడిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు కాలుష్యంతో ఇబ్బందులు పడే గ్రామాలకు వైద్యం గాని మరి ఏ ఇతర ఇతర సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు లేవు. దయచేసి ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఇక్కడ పొల్యూషన్ వల్ల అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకు సరైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పొల్యూషన్ నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ రహీమ్, ముత్తుకూరు, మనుబోలు మండలాల అధ్యక్షులు గణపతి, శ్రీహరి, వీరబాబు, వెంకయ్య, శేషారెడ్డి, రమేష్ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.