గిరిజనులకు బియ్యం అందజేసిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీకి ఆనుకొని ఉన్న గిరిజనులకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు 100 కేజీలు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 10 గిరిజన కుటుంబాలు గుడిసెలలో నివసిస్తూ కరెంటు లేక, తినడానికి తిండి కూడా దొరకనీ పరిస్థితి రెక్కాడితేడితే కాని డొక్కాడని కుటుంబాలు, కనీసం పిల్లలకి బట్టలు కూడా తెచ్చుకోలేని స్థితి. వారు కష్టపడి తెచ్చిన డబ్బులు తినడానికి బియ్యం, వైద్యానికే సరిపోయేటువంటి పరిస్థితి. వారికి కనీసం రేషన్ కార్డు గాని ఆధార్ కార్డు గాని లేకపోవడం గమనార్హం. ఈ విషయము మా దృష్టికి రావడంతో మేము గత 4 నెలల నుంచి ప్రతి నెల కూడా రేషన్ కార్డు వచ్చేంతవరకు ఆ కుటుంబాలకి బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా ఇస్తూ రావడం జరుగుతుంది. ఈ నెల కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకి పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఎప్పుడైతే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అందించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయో అప్పటివరకు మేము వారికి బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అదేవిధంగా ప్రతినెలా ఇస్తున్నాం అందులో భాగంగా ఈనెల కూడా బియ్యము పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహీం భాయ్, వీరబాబు, శ్రీహరి, పవన్ తదితరులు పాల్గొన్నారు.