రాజ్యాంగ నిర్మాతకు సర్వేపల్లి జనసేన ఘననివాళి

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం పంచాయతీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతమాత ముద్దుబిడ్డ శాస్త్రవేత్త, న్యాయవాదిగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా, అంటరానితనం కుల నిర్మూలనకు ఆయన చేసిన పోరాటాలు, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ రాజకీయాలలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పేద బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నింపుకునే విధంగా ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ సరైన పాలకులను ఎంచుకునే దానికి అవకాశం కల్పించే విధంగా మార్పు కోసం అడుగులు వేసిన మహనీయ మూర్తి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలంటే రాబోయే రోజుల్లో ప్రజలలో మార్పు రావాలి, ఆ మార్పు జనసేనతో సాధ్యం. అవినీతి లేని పరిపాలన కొనసాగాలి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో శ్రీహరి, వెంకటేశ్వర్లు, ఎలీషా, బాలయ్య, ఆదిమూర్తి, శ్యాంసుందర్, కోటి, విజయ్, ఉదయ్, శ్రీనివాసులు, నూతన్, వెంకటేష్, పినిశెట్టి మల్లికార్జున్, రహీం తదితరులు పాల్గొన్నారు.