నాదెండ్ల దృష్టికి పలు సమస్యలను తీసుకు వెళ్ళిన సతివాడ

శ్రీకాకుళంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాల్లో వీరఘట్టం మండలం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతివాడ వెంకటరమణ వేదిక పై నాదెండ్ల మనోహర్ సమక్షంలో మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, డంపింగ్ యార్డ్, మార్కెట్ యార్డ్, కిమ్మి రుషింగ్ బ్రిజ్జి నిర్మాణం, ఏజెన్సీలో రహదారులు లేవని, త్రాగునీరు, అంబులెన్స్ లో లేక డోలీలుతో వైద్యం కోసం కిందకు తీసుకురావాల్సి వస్తుందని. మరియు వివిధ పలు సమస్యలను నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రౌతు శివకుమారి మాట్లాడుతూ.. జనసైనికులు పట్టుదలతో పని చేయాల్సిన అవసరం ఉందని, అలాగే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె అన్నారు. అలాగే కీమ్మి- ఋషింగు బ్రిజ్జీ వంటి పలు సమస్యలను నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో వీరఘట్టం మండలం జనసైనికులు పాల్గొన్నారు.