42, 43వ డివిజన్ లలో సత్యనారాయణ సుజనా చౌదరి పర్యటన
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి సత్యనారాయణ సుజనా చౌదరి ఆదివారం 42, 43వ డివిజన్ లలో పర్యటించారు. ఈ సందర్భంలో స్థానిక ప్రియదర్శిని కాలనీ 450, 300 ఎస్ ఎఫ్ టి బ్లాక్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీని సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారు తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం గెలిచిన వెంటనే మీ సమస్యలన్నింటిని ఒక నెల రోజుల వ్యవదిలో పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 42 అడుగుల అధ్యక్షురాలు తిరుపతి అనూష 42వ డివిజన్ అధ్యక్షుడు ముదిరాజ్ శివాజీ, యేదుపాటి రమణి యేదుపాటి రామయ్య, జనసేన పార్టీ ప్రచార కమిటీ, విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మరియు జనసేన టిడిపి బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-21-at-7.02.08-PM-1024x576.jpeg)